సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- July 19, 2026
జపాన్: భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పీవీ సింధు జపాన్ ఓపెన్ 2026 లో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. టోక్యోలో ఆదివారం జరిగిన ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్లో సింధు 21-17, 21-17 తేడాతో జపాన్ స్టార్ ప్లేయర్ అకానె యామగూచిని వరుస గేమ్స్లో ఓడించింది. ఈ అద్భుత విజయంతో సింధు సరికొత్త రికార్డు సృష్టించింది. గాయాల నుంచి కోలుకుని, సుదీర్ఘ టైటిల్ కరవుకు ఎండ్ కార్డ్ వేస్తూ సింధు అదరగొట్టింది. దీంతో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.
స్టార్ షట్లర్ పీవీ సింధు భారత బ్యాడ్మింటన్ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టించింది. జపాన్ ఓపెన్ 2026 టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శనతో క విజేతగా నిలిచింది. టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో సింధు అసాధారణ ఆటతీరును కనబరిచింది. హోమ్ క్రౌడ్ మద్దతుతో బరిలోకి దిగిన జపాన్ స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ప్రపంచ నంబర్ 3 అకానె యామగూచిని వరుస గేమ్స్లో చిత్తు చేసింది. దీంతో జపాన్ ఓపెన్ సూపర్ 750 టైటిల్ దక్కించుకుంది.
గత రెండేళ్లుగా పీవీ సింధు ఫామ్పై, ఆమె ఆటతీరుపై క్రీడా వర్గాల్లో రకరకాల సందేహాలు వ్యక్తమయ్యాయి. వరుస గాయాల బారిన పడటం, ఆధునిక బ్యాడ్మింటన్ ఆటలో వస్తున్న వేగవంతమైన మార్పులు, 2024లో సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ తర్వాత సుదీర్ఘ కాలంగా టైటిల్ కరవు ఎదుర్కోవడం వంటి సమస్యలు ఆమెను వెంటాడాయి. దీంతో సింధు మళ్లీ తన పాత ఫామ్ను అందుకోగలదా లేదా అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే వాటన్నింటికీ ఈ 31 ఏళ్ల భారత స్టార్ ప్లేయర్ తన రా పవర్, అద్భుతమైన వ్యూహాలు, మానసిక దృఢత్వంతో కూడిన ఆటతో టోక్యో కోర్టులోనే పక్కా సమాధానం ఇచ్చింది.
ఫైనల్ మ్యాచ్ ఆరంభం నుంచి ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది. మొదటి గేమ్లో సింధు తనదైన శైలిలో క్రాస్ కోర్ట్ డ్రాప్స్, పవర్ఫుల్ స్మాష్లతో యామగూచి లయను దెబ్బతీసింది. ఒక దశలో స్కోరు బోర్డు ఇరువైపులా సమంగా మారుతూ ఉత్కంఠ రేపినప్పటికీ, ఒత్తిడి సమయాల్లో సింధు పట్టుదలగా నిలిచి కీలక పాయింట్లు సాధించి మొదటి గేమ్ను 21-17 తో కైవసం చేసుకుంది. తొలి గేమ్ గెలిచిన ఊపుతో రెండో గేమ్లో సింధు తన అగ్రెసివ్ ఆటను మరింత పెంచింది. జపాన్ ప్రేక్షకుల నుంచి లభిస్తున్న మద్దతుతో యామగూచి పుంజుకోవడానికి గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ, సింధు డిఫెన్స్ విభాగాన్ని ఛేదించలేకపోయింది. సింధు నెట్ ప్లే వద్ద చూపిన చాకచక్యం యామగూచిని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టి తప్పులు చేసేలా చేసింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







