అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- July 19, 2026
అమ్మాన్: జోర్డాన్లోని కింగ్ హుస్సేన్ అంతర్జాతీయ విమానాశ్రయం (అకాబా) మరియు అకాబా పోర్టు సాధారణంగానే కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, వాటిని ఖాళీ చేయాలని ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని జోర్డాన్ ప్రభుత్వ అధికార ప్రతినిధి, ప్రభుత్వ కమ్యూనికేషన్ మంత్రి మహ్మద్ మొమాని స్పష్టం చేశారు.
జోర్డాన్ అధికారిక వార్తా సంస్థ పెట్రా (Petra) వెల్లడించిన వివరాల ప్రకారం, ఆదివారం మీడియాతో మాట్లాడిన మొమాని, గత కొన్ని గంటలుగా జోర్డాన్ భద్రతా సంస్థలు ఎలాంటి సంభావ్య ముప్పును గుర్తించలేదని తెలిపారు. ప్రస్తుతం ప్రజలను హెచ్చరించేంత ప్రమాదకర పరిస్థితి ఏదీ లేదని ఆయన పేర్కొన్నారు.
కింగ్ హుస్సేన్ అంతర్జాతీయ విమానాశ్రయం, అకాబా పోర్టులో అన్ని కార్యకలాపాలు సాధారణ విధానంలోనే కొనసాగుతున్నాయని చెప్పారు. భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు అమల్లో ఉన్నాయని, ఎలాంటి ముప్పు తలెత్తినా వెంటనే హెచ్చరిక సైరన్లు మోగించే విధానాన్ని సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు.
ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక వర్గాల నుంచి వచ్చే సమాచారాన్నే విశ్వసించాలని జోర్డాన్ ప్రభుత్వం సూచించింది. దేశ భద్రతా పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, అవసరమైతే తక్షణ చర్యలు తీసుకునేందుకు అన్ని వ్యవస్థలు సిద్ధంగా ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







