నడిమింటి నరసింగరావు.. గౌతమ్తో అల్లూరి సీతారామరాజు..
- August 14, 2016
ఓ ఎక్స్క్లూసివ్ న్యూస్.. మహేష్ బాబు తనయుడు గౌతమ్తో 'అల్లూరి సీతారామరాజు' తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. సూపర్ స్టార్ కృష్ణ 100వ సినిమాగా వచ్చిన అల్లూరి సీతారామరాజు సంచలన విజయం సాధించి ఆయన కెరీర్ని పీక్స్ తీసుకువెళ్ళింది. ఆ సినిమాలో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్, కైమాక్స్లో చెప్పిన డైలాగ్స్ నేటికీ కృష్ణ అభిమానులనే కాకుండా చూసిన వారందరికీ రోమాలు నిక్కపొడుచుకునేలా చేస్తాయి. ఇప్పుడు ఆ చిత్రాన్ని కృష్ణ మనవడు గౌతమ్తో తెరకెక్కించాలని ఓ సీనియర్ రైటర్ ప్రయత్నం చేస్తున్నారు.కృష్ణవంశీ మొదటి సినిమా 'గులాబి', రామ్ గోపాల్ వర్మ 'అనగనగా ఒక రోజు' సినిమాల రైటర్ నడిమింటి నరసింగరావు.. గౌతమ్తో అల్లూరి సీతారామరాజు తెరకెక్కించే పనిలో వున్నారు. ఆయన ఈ సినిమా గురించి ఎంతో రీసెర్చ్ వర్క్ చేసి 'రామరాజు' స్వాతంత్ర్య పోరాట యోధుడిగా మారడానికి చిన్నతనంలో ఎటువంటి సంఘటనలు ప్రభావితం చేసాయి అనే కథాంశంతో 'శ్రీరామరాజు' స్క్రిప్ట్ రెడీ చేసారట. బాల్యం నుండి ఎనిమిదవ తరగతి చదివే వరకూ రామరాజు జీవితంలో జరిగిన సంఘటనలు.. వాటి వల్ల ప్రభావితమైన అతను స్వాతంత్ర పోరాట యోధుడిగా మారడం వంటి అంశాలున్న తన స్క్రిప్ట్కి గౌతం యాప్ట్ అని, అందుకే అతనితో చేసేందుకు ప్రయత్నాల్లో వున్నారని తెలుస్తోంది. ఇక తనని అల్లూరి సీతారామరాజు సినిమా ఎంతో ప్రభావితం చేసిందనే చెప్పే కృష్ణ వంశీ.. ఈ మూవీ డైరెక్ట్ చేయబోతున్నాడని తెలుస్తోంది. అన్నీ కుదిరితే.. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతుందన్నమాట. అదే జరిగితే సూపర్ స్టార్ అభిమానులకు పండగే
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







