వంటింట్లో దొరికే వస్తువులతో చర్మం నవయౌవనంగా..
- August 14, 2016
అందమంటే ఖరీదైన క్రీములతోనే సాధ్యం కాదు... వంటింట్లో దొరికే వస్తువులతోనూ సులభంగా సాధ్యపడుతుంది. దీనికి మీరు చేయాల్సిందలా? కొంత శ్రద్ధా, సమయం పెట్టడమే!
బొ ప్పాయి సహజ పీలింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. దీన్ని ఉపయోగిస్తే చర్మంపై ఉండే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు తగ్గుతాయి. మరి ఎలా ఉపయోగించాలి....బొప్పాయి పండుని మెత్తగా చేసుకుని దానికి చెంచా చొప్పున నిమ్మరసం, బియ్యప్పిండి కలుపుకుని ముఖానికి పూతలా వేయాలి. పావుగంటయ్యాక ముఖం కడిగేసుకుంటే మీ సమస్య దూరమవుతుంది. చర్మ రంగూ మెరుగుపడుతుంది.
*
చర్మం అసలు వయసుకంటే ఎక్కువ కనిపిస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కోడిగుడ్డులోని తెల్లసొన, కాసిని పాలు వేసి బాగా గిలకొట్టాలి. దానికి కాస్త తేనె చేర్చి ముఖానికి పూతలా వేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం నవయౌవనంగా కనిపిస్తుంది.
*
మృతకణాల్ని తొలగించాలంటే.. పావుకప్పు ఓట్స్ని ముందుగా పాలల్లో నానబెట్టుకోవాలి. దానికి చిటికెడు పసుపు, చెంచా పంచదార, నాలుగైదు బాదం గింజల ముద్ద వేసి కలపాలి. దాన్ని ముఖానికి రాసుకుని సవ్య, అపసవ్య దిశల్లో మర్దన చేయాలి. ఇలా పదినిమిషాలు చేశాక చల్లటి నీళ్లతో కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకుంటే సరి. చర్మం మృదువుగా మారుతుంది.
* కాలేజీ అమ్మాయిలు...తరచూ బయటతిరగడం వల్ల చర్మం నిగారింపు తగ్గుతుంది. కాలుష్యం, దుమ్మూ, ధూళి ఇందుకు కారణం కావొచ్చు. అందుకే తరచూ చన్నీళ్లతో ముఖం కడుక్కోవడం తప్పనిసరి. ఇంటికి వచ్చాక టొమాటోను గుండ్రంగా కోసి పంచదారలో అద్ది ముఖంపై మృదువుగా రుద్దాలి. ఇలా చేస్తే టొమాటోలోని పోషకాలు చర్మగ్రంథుల్లోకి చొచ్చుకుపోయి చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఫలితంగా ముఖం తాజాగా కనిపిస్తుంది
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









