వరుస పేలుళ్లు అసోంలో..

- August 15, 2016 , by Maagulf
వరుస పేలుళ్లు అసోంలో..

ఓవైపు రాష్ట్రమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటుంటే.. మరోవైపు అసోంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉల్ఫా-ఇండిపెండెంట్‌ మిలిటెంట్లు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.
తొలుత ఉదయం 7.15 గంటల ప్రాంతంలో లయ్‌పులిలోని ఇందిరాగాంధీ స్కూల్‌ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఇది జరిగిన కొద్ది నిమిషాలకే.. దూందుమా ప్రాంతంలోని ఓ టీ ఎస్టేట్‌, మసువా ప్రాంతంలో వెంటవెంటనే బాంబులు పేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత కొద్ది సేపటికే ఫిలోబరి ప్రాంతంలో మరోసారి పేలుడు సంభవించింది. వరుస పేలుళ్లతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎక్కడా ఎవరూ గాయపడనట్లు సమాచారం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com