వరుస పేలుళ్లు అసోంలో..
- August 15, 2016
ఓవైపు రాష్ట్రమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకొంటుంటే.. మరోవైపు అసోంలో వరుస పేలుళ్లు సంభవించాయి. ఉల్ఫా-ఇండిపెండెంట్ మిలిటెంట్లు రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఐఈడీ పేలుళ్లకు పాల్పడ్డారు. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనల్లో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు తెలిపారు.
తొలుత ఉదయం 7.15 గంటల ప్రాంతంలో లయ్పులిలోని ఇందిరాగాంధీ స్కూల్ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఇది జరిగిన కొద్ది నిమిషాలకే.. దూందుమా ప్రాంతంలోని ఓ టీ ఎస్టేట్, మసువా ప్రాంతంలో వెంటవెంటనే బాంబులు పేలినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత కొద్ది సేపటికే ఫిలోబరి ప్రాంతంలో మరోసారి పేలుడు సంభవించింది. వరుస పేలుళ్లతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే ఎక్కడా ఎవరూ గాయపడనట్లు సమాచారం లేదు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









