మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!

- August 05, 2026 , by Maagulf
మద్యం మత్తులో డ్రైవింగ్.. ఒకరి మృతి, 8 మందికి గాయాలు..!!

మనామా: మద్యం మత్తులో వాహనం నడుపుతూ బస్సును ఢీకొట్టిన డ్రైవర్‌ను బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అదుపులోకి తీసుకుంది. అల్ సయా ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.

ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు మద్యం సేవించి వాహనం నడుపుతున్నట్లు, అలాగే రహదారిపై దృష్టి కోల్పోవడంతో ముందున్న బస్సును వెనుక నుంచి ఢీకొట్టినట్లు గుర్తించారు. ఈ ఘటనలో బస్సులోని ఒక ప్రయాణికుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెలిపింది.

ఘటన అనంతరం పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. నిందితుడిని విచారించి, అతనిపై ఉన్న ఆధారాలను పరిశీలించిన అనంతరం దర్యాప్తు పూర్తయ్యే వరకు జ్యుడీషియల్ కస్టడీలో పెట్టాలని ఆదేశించింది.  దర్యాప్తు పూర్తైన అనంతరం నిందితుడిపై క్రిమినల్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com