మతపరమైన గొడవలకు దారి

- August 16, 2016 , by Maagulf
మతపరమైన గొడవలకు దారి

నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. శాలిబండ ఎంఐఎం కార్పొరేటర్ము జఫర్‌ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. 2012 చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయ వివాదం కేసులో ముజఫర్‌ ఏ2 నిందితుడిగా ఉన్నారు. గతంలో ఆలయం వద్ద ఉన్న షెడ్డును తొలగించే క్రమంలో చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. మతపరమైన గొడవలకు దారి తీసిందన్న ఉద్దేశంతో అప్పట్లో పోలీసులు ముజఫర్‌పై చర్యలకు సిద్ధమయ్యారు.
కాగా అప్పటి నుంచి ముజఫర్ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో కేసును పోలీసులు సిట్ అధికారులకు అప్పగించారు. విచారణలో భాగంగా ఏ1 నిందితుడిని ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేశారు. ఏ2 నిందితుడిగా ఉన్న ముజఫర్‌ను పట్టుకునే క్రమంలో ఇంటికి వెళ్లగా అతడు లేకపోవడంతో ఇతరులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముజఫర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు స్పష్టం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com