మతపరమైన గొడవలకు దారి
- August 16, 2016
నగరంలోని పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. శాలిబండ ఎంఐఎం కార్పొరేటర్ము జఫర్ ఇంట్లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. 2012 చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయ వివాదం కేసులో ముజఫర్ ఏ2 నిందితుడిగా ఉన్నారు. గతంలో ఆలయం వద్ద ఉన్న షెడ్డును తొలగించే క్రమంలో చార్మినార్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చెలరేగాయి. మతపరమైన గొడవలకు దారి తీసిందన్న ఉద్దేశంతో అప్పట్లో పోలీసులు ముజఫర్పై చర్యలకు సిద్ధమయ్యారు.
కాగా అప్పటి నుంచి ముజఫర్ తప్పించుకు తిరుగుతున్నారు. దీంతో కేసును పోలీసులు సిట్ అధికారులకు అప్పగించారు. విచారణలో భాగంగా ఏ1 నిందితుడిని ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేశారు. ఏ2 నిందితుడిగా ఉన్న ముజఫర్ను పట్టుకునే క్రమంలో ఇంటికి వెళ్లగా అతడు లేకపోవడంతో ఇతరులను ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులను కొంతమంది అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముజఫర్ను ఎట్టిపరిస్థితుల్లోనూ అరెస్ట్ చేస్తామని సిట్ అధికారులు స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







