పాకిస్థాన్‌ జట్టుపై స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఐసీసీ జరిమానా

- August 16, 2016 , by Maagulf
పాకిస్థాన్‌ జట్టుపై స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఐసీసీ జరిమానా

ఇంగ్లాండ్‌తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించిన పాకిస్థాన్‌ జట్టుపై స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఐసీసీ జరిమానా విధించింది. ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో పాకిస్థాన్‌ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ టెస్టులో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే పాకిస్థాన్‌ ఒక ఓవర్‌ తక్కువగా వేసినట్లు మ్యాచ్‌ రిఫరీ రిచర్డ్‌సన్‌ తేల్చారు. దీంతో ఐసీసీ నియమావళి ప్రకారం కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌ మ్యాచ్‌ ఫీజులో 20 శాతం, జట్టులోని మిగతా ఆటగాళ్లకి 10 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఏడాదిలోపు పాకిస్థాన్‌ మరోసారి ఇలా స్లో ఓవర్‌ రేట్‌ తప్పిదం చేస్తే కెప్టెన్‌ మిస్బావుల్‌ హక్‌పై సస్పెన్షన్‌ వేటు పడే ప్రమాదం ఉంటుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com