పాకిస్థాన్ జట్టుపై స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ జరిమానా
- August 16, 2016
ఇంగ్లాండ్తో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ను 2-2తో డ్రాగా ముగించిన పాకిస్థాన్ జట్టుపై స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ జరిమానా విధించింది. ఆదివారం ముగిసిన నాలుగో టెస్టులో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే ఈ టెస్టులో నిర్ణీత సమయంలో వేయాల్సిన ఓవర్ల కంటే పాకిస్థాన్ ఒక ఓవర్ తక్కువగా వేసినట్లు మ్యాచ్ రిఫరీ రిచర్డ్సన్ తేల్చారు. దీంతో ఐసీసీ నియమావళి ప్రకారం కెప్టెన్ మిస్బావుల్ హక్ మ్యాచ్ ఫీజులో 20 శాతం, జట్టులోని మిగతా ఆటగాళ్లకి 10 శాతం జరిమానా విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఏడాదిలోపు పాకిస్థాన్ మరోసారి ఇలా స్లో ఓవర్ రేట్ తప్పిదం చేస్తే కెప్టెన్ మిస్బావుల్ హక్పై సస్పెన్షన్ వేటు పడే ప్రమాదం ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







