వీధుల్లో వేధింపులపై అల్ ఖువాయిర్ నివాసితుల ఫిర్యాదు
- August 16, 2016
32 ఏళ్ళ మహిళ ఒంటరిగా వెళుతున్న సమయంలో ఆమెను కొందరు ఆకతాయిలు వేధిస్తున్నారు. వాహనాల్లో నెమ్మదిగా వస్తూ, 'రేటెంత' అని అడుగుతుండడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇలాంటి ఘటనలు అల్ ఖువాయిర్ ప్రాంతంలో నిత్యకృత్యమైపోయాయని అక్కడి ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు తమ పరిస్థితిని అర్థం చేసుకుని తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. 14 నుంచి 15 ఏళ్ళలోపు యువకులు ఎక్కువగా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వారు వాపోతున్నారు. రాయల్ ఒమన్ పోలీసు వర్గాలు తనిఖీలు నిర్వహిస్తున్నా, చాలా సందర్భాల్లో యువత తప్పించుకుంటున్నారనీ, 14 నుంచి 15 ఏళ్ళ లోపు వారే కావడంతో వారి పట్ల ఎవరికీ అనుమానం రావడంలేదని బాధితులు వాపోయారు. పోలీసులకు ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







