భారత్ కో జానియే క్విజ్కు ముగియనున్న గడువు..!!
- August 14, 2026
న్యూఢిల్లీ: భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ‘భారత్ కో జానియే’ (Know India) క్విజ్ లో పాల్గొనేందుకు గడువు నేటితో ముగియనుంది. విదేశాల్లో నివసిస్తున్న భారతీయ యువత, ఎన్నారైలు (NRIలు), భారత సంతతి వ్యక్తులు (PIOలు), అలాగే విదేశీ పౌరుల కోసం ఈ క్విజ్ను నిర్వహిస్తున్నారు. భారతదేశ చరిత్ర, వారసత్వం, సంస్కృతి, సంప్రదాయాలు, దేశ ప్రగతి, విజయాలకు సంబంధించిన ప్రశ్నలు ఇందులో ఉంటాయి.
భారత్ గొప్ప వారసత్వం, సాంస్కృతిక వైవిధ్యం, అభివృద్ధి ప్రయాణాన్ని తెలుసుకునేలా ఈ ప్రత్యేక ఎడిషన్ను రూపొందించారు. విదేశాల్లో ఉన్న భారతీయ యువతతో పాటు భారతదేశంపై ఆసక్తి ఉన్న విదేశీయులు కూడా ఇందులో పాల్గొనవచ్చు. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసి క్విజ్లో పాల్గొనాల్సి ఉంటుంది.
క్విజ్ వెబ్సైట్: భారత్ కో జానియే క్విజ్ (https://bkjquiz.com )
తాజా వార్తలు
- ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- రైతులకు సాగునీరు, గృహాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం: సీఎం రేవంత్
- సమైక్య భారత నిర్మాణానికి కృషి చేద్దాం ..దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
- దుబాయ్లో ఘనంగా భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు..
- వివక్షలు లేని ప్రగతి ప్రస్థానానికి ప్రతి ఒక్కరూ చోదక శక్తులు కావాలి: వెంకయ్య నాయుడు
- మెట్రోలింక్ బస్సు మార్గం M304లో మార్పులు..!!
- ఇంధన రంగంపై బహ్రెయిన్–థాయ్లాండ్ చర్చలు..!!
- తల్లిచేతిలో కత్తిపోట్లకు గురైన చిన్నారులు.. పరామర్శించిన కువైట్ మంత్రి..!!
- లైవ్ లో అసభ్యకర కంటెంట్.. మహిళకు ఏడాది జైలు, దేశ బహిష్కరణ..!!
- జెడ్డా పోర్టులో 58.6 కిలోల మెథాంఫెటమైన్ పట్టివేత..!!







