1,275 ఛానళ్ల మూసివేత..34.29 మిలియన్ల కంటెంట్ తొలగింపు..!!
- August 21, 2026
రియాద్: 2026 తొలి ఆరు నెలల్లో ఆన్లైన్లో తీవ్రవాద భావజాలాన్ని ప్రచారం చేస్తున్న 1,275 ఛానళ్లను మూసివేసి, 34.29 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ను తొలగించినట్లు గ్లోబల్ సెంటర్ ఫర్ కాంబాటింగ్ ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీ (Etidal) వెల్లడించింది. డిజిటల్ వేదికల్లో తీవ్రవాద ప్రచారాన్ని అడ్డుకునేందుకు Etidal, Telegram సంస్థలు సంయుక్తంగా చేపట్టిన చర్యల్లో భాగంగా ఈ తొలగింపులు జరిగినట్లు తెలిపాయి.
Etidal, Telegram మధ్య 2022, ఫిబ్రవరిలో సహకారం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఏడాది జూన్ 30 వరకు మొత్తం 292.6 మిలియన్ల తీవ్రవాద కంటెంట్ను తొలగించినట్లు వెల్లడించింది. ఇదే కాలంలో తీవ్రవాద ప్రచారానికి ఉపయోగించిన 20,360 ఛానళ్లను మూసివేశారు. డిజిటల్ స్పేస్లో తీవ్రవాద ప్రచారం, భావజాల వ్యాప్తిని అడ్డుకోవడంలో Etidal, Telegram మధ్య కొనసాగుతున్న సహకారం కీలకంగా మారిందని సంస్థ పేర్కొంది. ఈ సంయుక్త చర్యలు ఆన్లైన్లో తీవ్రవాద కంటెంట్ వ్యాప్తిని పరిమితం చేయడంతో పాటు మరింత సురక్షితమైన డిజిటల్ వాతావరణం ఏర్పడేందుకు దోహదపడుతున్నాయని తెలిపింది.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో ఫేక్ హాలిడే రెంటల్ ప్రకటనలపై హెచ్చరికలు జారీ..!!
- బహ్రెయిన్లో భారీగా తగ్గిన ల్యాండ్లైన్ కనెక్షన్లు..!!
- ఆగస్టు 27న ఒమన్లో అధికారిక సెలవు..!!
- ప్రపంచంలోనే ISO 27001:2022 సర్టిఫికేషన్ పొందిన తొలి ఆలయంగా దుబాయ్ హిందూ టెంపుల్
- ఆపిల్ మాక్ యూజర్లకు సైబర్ అలర్ట్..!!
- 1,275 ఛానళ్ల మూసివేత..34.29 మిలియన్ల కంటెంట్ తొలగింపు..!!
- 2025లో 6.5 మిలియన్లకు పైగా వాహనాలకు పీరియాడిక్ ఇన్స్పెక్షన్..!!
- యూఏఈలో ఈజిప్టు కార్మికుల తొలగింపుల వార్తలు అవాస్తవం..!!
- బహ్రెయిన్: మత వర్గాన్ని అవమానించేలా సోషల్ మీడియాలో పోస్టులు..60 ఏళ్ల వ్యక్తి అరెస్ట్
- స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీతో బాధపడుతున్న ఏడాది చిన్నారికి దుబాయ్ రూలర్ అండ







