200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- August 25, 2026
కువైట్ : కువైట్లోని సిక్త్ రింగ్ రోడ్డుపై గంటకు 200 కిలోమీటర్ల వేగంతో కారు నడిపిన ఓ కువైట్ పౌరుడిని ట్రాఫిక్ పోలీసులు అదుపులోకి తీసుకుని సెంట్రల్ జైలుకు తరలించారు. అంత వేగంగా వాహనం నడపడం అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు.
భద్రతా వర్గాల సమాచారం ప్రకారం.. మొబైల్ రాడార్ ద్వారా వాహనం అధిక వేగంతో వెళ్తున్నట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టి వాహనాన్ని అడ్డుకున్నారు. పట్టుబడిన లగ్జరీ కారు విలువ KD100,000 (కువైట్ దినార్లు)కు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
డ్రైవర్కు ట్రాఫిక్ ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోగ్రాఫిక్ ఆధారాలను చూపించారు. అనంతరం ట్రాఫిక్ డైరెక్టర్ జనరల్ ఆదేశాలతో చట్టపరమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా వాహనాన్ని రెండు నెలల పాటు సీజ్ చేయడంతో పాటు కేసును ట్రాఫిక్ కోర్టుకు అప్పగించారు.
ప్రవాసులు ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే వాహనం సీజ్ చేయడంతో పాటు దేశం నుంచి బహిష్కరణ, జరిమానా వంటి చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!







