మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- August 25, 2026
మనామా: ఇద్దరు మహిళల మానవ అక్రమ రవాణా కేసులో ఐదేళ్ల జైలు శిక్షకు గురైన వ్యక్తి దాఖలు చేసిన అప్పీల్పై విచారణను బహ్రెయిన్లోని ఫస్ట్ హై క్రిమినల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ ఆగస్టు 30కి వాయిదా వేసింది.
కేసు పత్రాల ప్రకారం.. నిందితులు ఓ క్రిమినల్ ముఠాగా ఏర్పడి ఇద్దరు మహిళలను అక్రమంగా తరలించి, వారి స్వేచ్ఛను పరిమితం చేసి, ఆర్థిక లాభం కోసం వ్యభిచారంలోకి బలవంతంగా నెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
మహిళల్లో ఒకరిని ఫ్యాషన్ మోడల్గా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి బహ్రెయిన్కు రప్పించినట్లు, మరో మహిళకు సెలూన్లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పినట్లు కేసు పత్రాల్లో పేర్కొన్నారు. అయితే బహ్రెయిన్కు వచ్చిన తర్వాత తమను వ్యభిచారంలోకి నెట్టేందుకు తీసుకొచ్చినట్లు ఇద్దరికీ తెలిసిందని ఆరోపణలు ఉన్నాయి.
నిందితులు మహిళలను బెదిరించడంతో పాటు వారి పాస్పోర్టులను స్వాధీనం చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వారిలో ఒకరు చివరకు కుటుంబ సభ్యులను, ఓ బహ్రెయిన్ వ్యక్తిని సంప్రదించగా, అతని సహాయంతో హాస్టల్ నుంచి బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కోర్టు పత్రాలు వెల్లడించాయి.
ఈ కేసులోని ఇతర నిందితులకు ఒకటి నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు విధించగా, నిందితులందరినీ శిక్షలు పూర్తయిన అనంతరం బహ్రెయిన్ నుంచి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







