459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!

- August 25, 2026 , by Maagulf
459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!

మస్కట్: ప్రవక్త మహమ్మద్ జన్మదినం సందర్భంగా ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ 459 మంది ఖైదీలకు ప్రత్యేక క్షమాభిక్ష ప్రకటించారు. వివిధ కేసుల్లో దోషులుగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఒమన్ పౌరులు, విదేశీయులు ఈ క్షమాభిక్ష పొందిన వారిలో ఉన్నారని అధికారులు తెలిపారు. 

ఖైదీల కుటుంబాల పట్ల సుల్తాన్ హైతమ్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధకు ఈ నిర్ణయం నిదర్శనమని అధికారిక ప్రకటనలో తెలిపారు.  ప్రవక్త జన్మదినం ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, కరుణ, మానవతా దృక్పథంతో ఈ ప్రత్యేక క్షమాభిక్షను జారీ చేసినట్లు వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com