షార్జా వాటర్ పార్కులో మూడేళ్ళ బాలుడు నీట మునక
- August 19, 2016
షార్జ: ఆహ్లాదం కోసం పార్కుకి వచ్చి తమ తమ వ్యవహారాల్లో నిమగ్నమైన ఆ తల్లితండ్రులు తమ మూడేళ్ళ బాబుని మరచిపోవడంతో ఆ చిన్నారి బుడి బుడి అడుగులతో నీట మడుగు వైపు వెళ్లి అందులో పడిపోయాడు. ఈ విషాదకర ఘటన షార్జాలో అల్ ముంతాజాహ్ పార్కులోని వాటర్ పార్కు వద్ద బుధవారం జరిగింది. అక్కడ మూడేళ్ళ బాలుడు నీట మునిగిపోవడంతో రక్షించిన స్థానికులు తరువాత అల్ ఖ్అసిమి హాస్పిటల్ లో చేర్పించారు. అక్కడ ప్రస్తుతం చావు బతుకుల మద్య ఆ పసి ప్రాణం పోరాడుతోంది. ఎం.ఎస్.ఎస్. గా గుర్తించబడిన ఆ బాలుడు అల్ ఖ్అసిమి హాస్పిటల్ అత్యవసర విభాగంలో బుధవారం రాత్రి 7.50 సమయంలో చేర్పించారు ఆ పిల్లవాడు కాలు జారీ నీటిలో పడిపోయాడు. ఆ బాలుని కుటుంబం అది గమనించే సరికి నీటిలో మునకలువేస్తున్న స్థితిలో వారు గమనించారు. తేరుకున్న తల్లితండ్రులు యుఎఇ లోని అల్ ఖ్అసిమి ఆసుపత్రిలో మూడేళ్ళ బాలుడిని చేర్పించారు. అయితే , వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగా ఉందని పేర్కొన్నారు. ఇది తల్లితండ్రుల నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనబడుతుందని షార్జా పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. అల్ బుహారః పోలీసులు ఈ సంఘటన గూర్చి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







