ఈ నిర్లక్ష్యం కాదు క్షమార్హం
- August 19, 2016
ఆకాశాన్నంటే భవనాలు, అందులో సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం, దానికి తోడు కుటుంబ సభ్యుల నిర్లక్ష్యం.. ఇవన్నీ కలిసి పసి ప్రాణాల్ని చిదిపేస్తున్నాయి. సార్జాలో ఇటీవల అపార్ట్మెంట్లపైనుంచి పడిపోయి మృతి చెందుతున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గడచిన రెండు నెలల్లో ఐదుగురు చిన్నారులు ఇదే విధంగా బాల్కనీల్లోంచి కిందకు పడిపోయి చనిపోయారు. బాల్కనీలు, కిటికీల నుంచి పిల్లలు పడిపోతోంటే, వారిని సంరక్షించాల్సిన కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం వహిస్తుండడం దురదీష్టకరం. భవనాల మీద నుంచి పిల్లలు కిందపడి చనిపోవడానికి ప్రధాన కారణం కుటుంబ సభ్యుల నిర్లక్ష్యమేనని షార్జా పోలీస్ కమాండర్ - బ్రిగేడియర్ సైఫ్ అల్ షమ్సి చెప్పారు. కిటికీలు, అలాగే బాల్కనీల ఎత్తు కనీసం 120 సెంటీమీటర్లు ఉండేలా చూడాలనీ, కిటికీ ఊచల మధ్య గ్యాప్ 10 సెంటీమీటర్లు మాత్రమే ఉంటే ప్రమాదాలు జరగవనీ, నిర్మాణదారులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ విషయమై భవన నిర్మాణదారులు, అలాగే ల్యాండ్ లార్డ్స్తో సమావేశమై భద్రతా చర్యలు పెంచే ఏర్పాట్లు చేస్తామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









