పీవీ సింధుకు కోటి రూపాయలు బహుమతి ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం

- August 19, 2016 , by Maagulf
పీవీ సింధుకు కోటి రూపాయలు బహుమతి ప్రకటించిన తెలంగాణా ప్రభుత్వం

రియో ఒలింపిక్స్‌లో రజితం సాధించిన తొలి తెలుగు మహిళగా ఘనత సాధించిన పూసర్ల వెంకట సింధుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.కోటి నగదు బహుమతి ప్రకటించింది. దీంతో పాటు భారత బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ తరఫున రూ.50లక్షలు, సింధు కోచ్‌ పుల్లెల గోపీచంద్‌కు రూ.10లక్షల నగదు పురస్కారం అందించనున్నట్లు ప్రకటించారు. విశ్వక్రీడల్లో రజిత పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ రూ.50లక్షలు నగదు పురస్కారాన్ని ప్రకటించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com