శుక్రవారం ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవo..
- August 19, 2016
'అప్పట్లో ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటోల ఆధారంగా సినిమా బిజినెస్ జరిగేది. ఇప్పుడు టెక్నాలజీలో ఎన్నో మార్పులొచ్చాయి. ప్రతి ఒక్కరూ ఫొటోలు తీస్తున్నారు. డిజిటల్ యుగం వచ్చినా, ఫొటోగ్రఫీలో ఎన్ని మార్పులొచ్చినా ఫొటోగ్రాఫర్ స్థానం మాత్రం ఎప్పటికీ పదిలమే' అని దాసరి నారాయణరావు అన్నారు. ప్రపంచ ఫొటోగ్రఫి దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు సినీ స్టిల్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా సీనియర్ ఫొటోగ్రాఫర్లకు దాసరి చేతుల మీదుగా సత్కారం జరిగింది. అనంతరం దాసరి మాట్లాడుతూ, 'ఇప్పుడు సెల్ఫీ పేరుతో ప్రతి ఒక్కరూ ఫొటోగ్రాఫర్ అవతారం ఎత్తుతున్నారు' అని అన్నారు.'మా రెమ్యూనరేషన్ గత 30ఏండ్లుగా అలానే ఉంది. అసోసియేషన్లో చాలా మంది ఆర్థిక పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉంది. నిర్మాతలు మా పరిస్థితిని అర్థం చేసుకుని రెమ్యూనరేషన్ పెంచాలని కోరుకుంటున్నాం' అని అసోసియేషన్ అధ్యక్షుడు పాల వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచు మనోజ్, దామోదర ప్రసాద్, బూర్గుపల్లి శివరామకృష్ణ, శివాజీ రాజా, టి.రామసత్యనారాయణ, అసోసియేషన్ కార్యదర్శి వీరభద్రం, కోశాధికారి రాము తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!
- ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ పై 3 మిస్సైళ్లతో దాడికి యత్నం..!!









