రియో పతక విజేతలైన సింధు, సాక్షి మాలిక్ లకు దుబాయ్ నిర్వాసిత వ్యాపారి భారీ నజరానా
- August 21, 2016
దుబాయ్: రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించి.. భారతదేశ ఖ్యాతిని ప్రపంచపటంలో చాటిన షట్లర్ సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్లకు దుబాయిలోని ఓ భారత వ్యాపారి 7. 5 మిలియన్ల ( 410,305 డి హెచ్ ) భారీ నజరానా ప్రకటించారు. సింధుకు రూ.5 మిలియన్లు , సాక్షి మాలిక్ కు రూ.2. 5 మిలియన్లు చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నట్లు వ్యాపారి ముక్కత్తు సెబాస్టియన్ " మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు.కేరళలోని కొట్టాయంకు చెందిన సెబాస్టియన్ గత నలభై ఏళ్లుగా యూఏఈలో స్థిరపడ్డారు. దుబాయిలో ముక్కదాన్ ప్లాంటేషన్తో పాటు, బెంగళూరులో ఆటోబన్కార్ రెంటల్స్ వ్యాపారం చేస్తున్నారు. రియోలో భారత క్రీడాకారిణిలు సింధు, సాక్షి పతకాలు సాధించడం పట్ల సెబాస్టియన్ హర్షం వ్యక్తం చేశారు. వారిని చూస్తే గర్వంగా ఉందని.. అందుకే ఇలా నగదు బహుమతితో వారిని సత్కరించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అంతేగాక.. కోచిలో ఓ కార్యక్రమం ఏర్పాటుచేసి ఒలింపిక్ విజేతలను సన్మానించాలని భావిస్తున్నట్లు సెబాస్టియన్ చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







