సింధుకు హైదరాబాద్లో అడుగడుగునా నీరాజనాలు...
- August 22, 2016
ఒలింపిక్స్లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు హైదరాబాద్లో అడుగడుగునా నీరాజనాలు. అసమాన ప్రతిభతో పతకం తెచ్చిపెట్టిన ఫస్ట్ భారతీయ యువతిగా చరిత్ర సృష్టించింది ఆమె. సొంతరాష్ర్టం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. సింధు, కోచ్ గోపీచంద్లను తెలంగాణ మంత్రి కేటీఆర్తోపాటు ఏపీ మంత్రులు, అధికారులు, ఫ్యామిలీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో పుష్పగుచ్చాలిచ్చి సింధును సాదరంగా ఆహ్వానించారు. అక్కడనుంచి ఓపెన్ టాప్ వాహనంపై విజయోత్సవ ర్యాలీ సాగింది.శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి రాజేంద్రనగర్, అత్తాపూర్, మెహిదీపట్నం, టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ ర్యాలీని సాగింది. అనంతరం అక్కడి స్టేడియం అంతా తిరిగారు.అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రి కేటీఆర్.. సిందు, కోచ్ గోపిచంద్లను సన్మానించనున్నారు. మరోవైపు పతకం సాధించిన తర్వాత సింధు తొలిసారి నగరానికి రానున్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో హోర్డింగ్లు వెలిశాయి.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







