వరుణ్‌సందేశ్‌ "మిస్టర్‌ 420' ...

- August 22, 2016 , by Maagulf
వరుణ్‌సందేశ్‌

కథ, కథనాలు విభిన్నంగా "మిస్టర్‌ 420' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత గజ్జల హరికుమార్‌రెడ్డి తెలిపారు. వరుణ్‌సందేశ్‌, ప్రియాంక భరద్వాజ్‌ నాయకానాయికలుగా ఎస్‌.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సాన్వి క్రియేషన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, "వరుణ్‌సందేశ్‌కు ఇది సూపర్‌హిట్‌ చిత్రంగా నిలవబోతోందని గర్వంగా చెబుతున్నాను.
ఇందులో ఆయన కొత్త లుక్‌తో స్టైలిష్‌గా కనిపించబోతున్నారు. దర్శకుడు అనుకున్నట్లుగా సినిమాను పూర్తిచేస్తున్నారు. థర్టీ ఇయర్స్‌ ఫృథ్వి ఈ మధ్య వరుసగా తనదైన హాస్య పాత్రలతో ఆకట్టుకుంటున్న విషయం తెలియంది కాదు. ఈ చిత్రంలో కూడా తన పాత్ర ద్వారా మంచి వినోదాన్ని పంచనున్నారు. మోహన్‌చంద్ర సంభాషణలు చాలా బావుంటాయి. రియాన్‌ ముస్తఫా సంగీతం, జస్వంత్‌ ఛాయాగ్రహణం, చంద్రబోస్‌, అనంత్‌ శ్రీరామ్‌ల సాహిత్యం, నందు ఫైట్స్‌ సినిమాకు హైలైట్‌గా ఉండటంతో పాటు కథను ముందుకు నడిపిస్తాయి. ఈ నెల 27న చిత్ర ప్రముఖుల సమక్షంలో ఆడియోను, సెప్టెంబర్‌ 9న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. 

ఇంకా ఈ చిత్రంలో షాయాజీషిండే, రఘుబాబు, సాయి, షాని, శేఖర్‌, జీవా, రఘు కారుమంచి, రచ్చ రవి, మీనా తదితరులు తారాగణం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com