వరుణ్సందేశ్ "మిస్టర్ 420' ...
- August 22, 2016
కథ, కథనాలు విభిన్నంగా "మిస్టర్ 420' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని నిర్మాత గజ్జల హరికుమార్రెడ్డి తెలిపారు. వరుణ్సందేశ్, ప్రియాంక భరద్వాజ్ నాయకానాయికలుగా ఎస్.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సాన్వి క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.
ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, "వరుణ్సందేశ్కు ఇది సూపర్హిట్ చిత్రంగా నిలవబోతోందని గర్వంగా చెబుతున్నాను.ఇందులో ఆయన కొత్త లుక్తో స్టైలిష్గా కనిపించబోతున్నారు. దర్శకుడు అనుకున్నట్లుగా సినిమాను పూర్తిచేస్తున్నారు. థర్టీ ఇయర్స్ ఫృథ్వి ఈ మధ్య వరుసగా తనదైన హాస్య పాత్రలతో ఆకట్టుకుంటున్న విషయం తెలియంది కాదు. ఈ చిత్రంలో కూడా తన పాత్ర ద్వారా మంచి వినోదాన్ని పంచనున్నారు. మోహన్చంద్ర సంభాషణలు చాలా బావుంటాయి. రియాన్ ముస్తఫా సంగీతం, జస్వంత్ ఛాయాగ్రహణం, చంద్రబోస్, అనంత్ శ్రీరామ్ల సాహిత్యం, నందు ఫైట్స్ సినిమాకు హైలైట్గా ఉండటంతో పాటు కథను ముందుకు నడిపిస్తాయి. ఈ నెల 27న చిత్ర ప్రముఖుల సమక్షంలో ఆడియోను, సెప్టెంబర్ 9న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు.
ఇంకా ఈ చిత్రంలో షాయాజీషిండే, రఘుబాబు, సాయి, షాని, శేఖర్, జీవా, రఘు కారుమంచి, రచ్చ రవి, మీనా తదితరులు తారాగణం.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







