బలోచిస్థాన్ నేతలపై కేసులు నమోదు..
- August 22, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు పాకిస్థాన్లోని బలోచిస్థాన్ నేతలపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. బలోచిస్థాన్ స్వేచ్ఛా ఉద్యమానికి మోదీ ఇటీవల మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలను అక్కడ ఉద్యమం చేస్తున్న నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో బలోచ్ వేర్పాటు వాద నేతలు బ్రహందగ్ బుగ్టి, హర్బియార్ మారి, బనుక్ కరిమాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు వీరిపై వేర్పాటువాదానికి సంబంధించి ఐదు కేసులు నమోదైనట్లు చెప్పారు.భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బలోచిస్థాన్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







