బలోచిస్థాన్ నేతలపై కేసులు నమోదు..
- August 22, 2016
భారత ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలకు మద్దతు తెలిపినందుకు పాకిస్థాన్లోని బలోచిస్థాన్ నేతలపై అక్కడి ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. బలోచిస్థాన్ స్వేచ్ఛా ఉద్యమానికి మోదీ ఇటీవల మద్దతు పలుకుతూ వ్యాఖ్యలు చేశారు. మోదీ చేసిన వ్యాఖ్యలను అక్కడ ఉద్యమం చేస్తున్న నేతలు స్వాగతించారు. ఈ నేపథ్యంలో బలోచ్ వేర్పాటు వాద నేతలు బ్రహందగ్ బుగ్టి, హర్బియార్ మారి, బనుక్ కరిమాలపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పలువురు చేసిన ఫిర్యాదుల మేరకు వీరిపై వేర్పాటువాదానికి సంబంధించి ఐదు కేసులు నమోదైనట్లు చెప్పారు.భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో బలోచిస్థాన్ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









