దుబాయ్ ట్రామ్వేపై కొత్త యూ టర్న్స్
- August 23, 2016
రెండు కొత్త లెఫ్ట్ టర్న్స్, అలాగే రెండు యూ టర్న్స్ దుబాయ్ రటామ్ రూట్లో త్వరలో ప్రారంభం కానున్నాయని రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) వెల్లడించింది. జుమైరా బీచ్ రెసిడెన్స్ 1 మరియు జుమైరా బీచ్ రెసిడెన్స్ 2 స్టేషన్ల మధ్య అల్ సుఫౌ అల్ గార్బి స్ట్రీట్స్ ఇంటర్సెక్షన్ వద్ద ప్రారంభమయ్యే టర్న్స్ వాహనదారులకు మరింత ఉపయోగకరంగా ఉండనున్నాయి. రోడ్ సేఫ్టీలో భాగంగా నవంబర్ 2014న దుబాయ్ ట్రామ్ ప్రారంభం సందర్భంగా అన్ని యూ టర్న్స్, అలాగే లెఫ్ట్ టర్న్స్ని మూసివేశారు. ట్రామ్ అలాగే, వాహనాల మధ్య ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకున్నట్లు ఆర్టిఎ - ట్రాఫిక్ అండ్ రోడ్స్ ఏజెన్సీ సిఇఓ మైతా మొహమ్మద్ బిన్ అదాయ్ చెప్పారు. ఓ కమిటీని ఏర్పాటు చేసి, పూర్తిస్థాయి అధ్యయనం తర్వాతే కొత్త యూ టర్న్స్, కొత్త లెఫ్ట్ టర్న్స్పై నిర్నయం తీసుకున్నామని ఆమె వివరించారు. సేఫ్ సిగ్నలింగ్ వ్యవస్థలో భాగంగా ట్రాఫిక్ లైట్స్ని పూర్తిగా పరీక్షించామని ఆర్టిఎ వర్గాలు తెలిపాయి. ప్రత్యేకంగా సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేసి సిగ్నల్స్ని జంప్ చేసేవారిని గుర్తిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









