పీవీ సింధుకు ఎన్ఏసీ జ్యూయలర్స్ అరుదైన బహుమతి..
- August 24, 2016
ఒలింపిక్స్లో పతకం సాధించి, మువ్వనెల్ల పతాకాన్ని ఎగురవేసి చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం పీవీ సింధుకు ఎన్ఏసీ జ్యూయలర్స్ అరుదైన బహుమతిని ప్రకటించింది. దాదాపు 6లక్షల ఖరీదైన నెక్లెస్ను సింధుకు అందించనున్నట్లు యాజమాన్యం తెలిపింది. సింధుతో పాటు ఒలింపిక్స్లో ఇతర పతకాలు సాధించిన క్రీడాకారులకు కూడా బహుమతులను ప్రకటించింది. కాంస్య పతకాన్ని సాధించిన సాక్షి మాలిక్కు 3లక్షల విలువ చేసే రవ్వల నెక్లెస్ను ప్రదానం చేస్తున్నట్లు సదరు షోరూం ప్రకటించింది. జిమ్నాస్టిక్స్లో అద్భుత ప్రదర్శన ఇచ్చి, మెడల్ను తృటిని కోల్పోయిన దీపా కర్మాకర్కు లక్ష రూపాయలు విలువ చేసే బహుమతిని అందించనున్నట్లు ఎన్ఏసీ జ్యూయలర్స్ యాజమాన్యం తెలిపింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







