జంట నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా..

- August 24, 2016 , by Maagulf
జంట నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా..

జంట నగరాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌లోని ఇస్కాన్‌ ఆలయంలో ఉదయం 4 గంటల నుంచే ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి. పెద్దసంఖ్యలో తరలివచ్చిన భక్తులు, హారతి, భజన, తులసి పూజ, పుష్పార్చన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విద్యుద్దీపాలు, వివిద రకాల పుష్ఫాలతో ఆలయాన్ని సుందరంగా అలంకరించారు. నగరంలో పలు కృష్ణాలయాల్లోనూ సందడి నెలకొంది. ఉదయం నుంచి ఆలయాల వద్ద బారులు తీరిన భక్తులు కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com