సహచరుడిని కత్తితో పొడిచి చంపి ఆపై శవాన్ని దగ్ధం చేసిన భారతీయుడు
- August 26, 2016
రియాడ్: అల్-ఫైసాలియాహ్ జిల్లాలో భారతీయ కార్మికుడు తన సహచరుడిని కత్తితో పొడిచి చంపి ఆ తర్వాత ఆ నేరాన్ని కప్పిపుచ్చడానికి చేసే ప్రయత్నంలో భాగంగా మృతదేహం ఆచూకీ లేకుండా చేయడానికి నిప్పంటించి తగలబెట్టినట్లు హత్యానేరం ఒప్పుకున్నాడు.జిల్లాలో ఒక తివాచీలు తయారుచేసే గిడ్డంగిలో అగ్నిప్రమాదం జరగడంపై స్పందించిందిన పౌర రక్షణ అగ్నిమాపక యూనిట్లు ప్రమాద స్థలంకు వెళ్ళినపుడు ఈ హత్యానేరం కనుగొనబడినట్లు రియాద్ పోలీసులు తెలిపారు.అగ్ని మాపక సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఒక ప్రాంతంలో వారు దాదాపు బూడిద కావొస్తున్న మానవ మృత శరీరం కనుగొన్నారు; ఈ మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరిశోధకులు స్వాధీనం చేసుకొని పరీక్షలు ప్రారంభించారు.గిడ్డంగిలో దారుణంగా హత్య చేయబడిన 40 ఏళ్ళ భారతీయుని కత్తితో పొడిచి హతమార్చిన అనంతరం అతని శరీరంకు నిప్పంటిచారు. ఆధారాలను బట్టి బాధితుడు డబ్బు వివాదం మీద భారతీయ సహ ఉద్యోగితో తగువు ఏర్పడిందని వీరి మధ్య వివాదానికి అదే ప్రధాన సమస్య అని మాకు తెలిసిందని పోలీసు ప్రతినిధి చెప్పారు. అప్పు తీసుకోవడం కారణంగా , హతుడు తన పాస్పోర్ట్ స్వాధీనం చేసుకొని వేధిస్తున్న నేపథ్యంలో విధిలేని పరిస్థుతులలో తన సహచరుడిని హత్య చేయాల్సి వచ్చిందని హంతకుడు ఒప్పుకున్నాడు. అదేవిధంగా అగ్నిప్రమాదం సృష్టించడానికి ముందు గిడ్డంగిలో 3,000 ఎస్ ఆర్ దొంగిలించినట్లు అంగీకరించాడు.ఈ హత్యకు సంబంధించిన ఆయుధం కత్తిని పోలీసులు సేకరించారు. నేరస్తుడుని పోలీసు విచారణ కోసం అదుపులో తీసుకొన్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







