షార్జాలో రోడ్డు మీద విడిచిపెట్టిన మగ శిశువుని రక్షించిన శస్త్రచికిత్స
- August 26, 2016
షార్జ: జన్మనిచ్చిన తల్లితండ్రులకు కనికరం లేకపోయినా...పసిబిడ్డ దైన్యస్థితికి జాలిపడ్డ వైద్యులు తమ శస్త్రచికిత్సతో ఆ పసికూనకు పునర్జన్మను ఇచ్చి వైద్యవృత్తికే వన్నె తెచ్చారా డాక్టర్లు.... పుట్టుకతోనే లోపం ఉన్న ఒక మగ శిశువుని దయలేని ఎవరో తల్లితండ్రులు షార్జా ప్రాంతంలో పబ్లిక్ రహదారిపై నిర్ధాక్షిణ్యంగా వదలివేసి వెళ్లిపోయారు. ఆ బాబుని అల్ ఖ్అసిమి హాస్పిటల్లో చేర్పించగా శస్త్రచికిత్స అనంతరం అక్కడ కోలుకొంటూ స్థిరమైన ఆరోగ్య స్థితిలో ఉన్నాడని ఆస్పత్రివర్గాలు పేర్కొంటున్నాయి .
ఈ నెల ఆగస్టు 10 వ తేదీన మూవెఇలాహ్ ప్రాంతంలో ఆ పసికందుని ఒక పబ్లిక్ రహదారిని పేవ్మెంట్ పక్కన వదిలివెళ్ళినట్లుగా కనుగొనబడింది. కడుపులోని ప్రేగులు తదితర అవయవాలు వెలుపల ఉన్న స్థితిలో పుట్టుకతోనే లోపంతో జన్మించిన ఈ శిశువుకు వైద్యులు విజయవంతంగా శస్త్రచికిత్స చేసినట్లు ప్రకటించారు. ఈ స్థితిలో దొరికిన ఈ శిశువుకు ఒక విజయవంతమైన ఒక శస్త్రచికిత్స జరిపారు. ప్రస్తుతం శిశువు యొక్క పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రిలో వైద్యులు పేర్కొన్నారు. ఆ బిడ్డ అనారోగ్యం కాస్త మెరుగుపడిన తరువాత షార్జాలోని పిల్లల రక్షణ కమిటీకి ఆ చిన్నారిని స్వాధీనం చేస్తామని వారు తెలిపారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







