'శతమానం భవతి' మూడు తరాల కథ...

- August 27, 2016 , by Maagulf
'శతమానం భవతి' మూడు తరాల కథ...

శ ర్వానంద్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'శతమానం భవతి'.

అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. వేగేశ్న సతీష్‌ దర్శకుడు. దిల్‌రాజు నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది.

తొలి సన్నివేశానికి సత్యరంగయ్య క్లాప్‌నిచ్చారు. రంగ యశ్వంత్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. ప్రసాద్‌ గౌరవ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు మాట్లాడుతూ ''మూడు తరాల కథ ఇది.

పెద్దలు ఆశీర్వదించేటప్పుడు 'శతమానం భవతి' అంటారు. ఆ పదంలోనే ఓ సానుకూల దృక్పథం ఉంది. కుటుంబ ప్రేక్షకులకు, యువతరానికీ నచ్చేలా ఈ కథని సిద్ధం చేశాం. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''జీవితంలోంచి పుట్టిన కథ, సమాజంలోంచి పుట్టుకొచ్చిన పాత్రలే తెరపై కనిపిస్తాయ''న్నారు. ప్రకాష్‌రాజ్‌, జయసుధ, ఇంద్రజ, శివాజీరాజా, ప్రవీణ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి, సంగీతం: మిక్కీ జె.మేయర్‌

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com