15 మంది పౌరులు మృతి
- August 27, 2016
సిరియాలోని తూర్పు అలెప్పోలోని మాడీ నగరం వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడులలో 15 మంది పౌరులు మృతి చెందారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ మానిటర్ తెలిపింది. బాబ్ అల్ నేరబ్ జిల్లాలో గురువారం జరిగిన బాంబు దాడులలో 11 మంది పిల్లలతోపాటు 15 మంది మరణించారు. వారికి నివాళులర్పిస్తున్న ప్రజలకు సమీపంలో ప్రభుత్వ విమానం బ్యారెల్ బాంబును విసిరింది. గాయపడ్డ వారికి సహాయం చేయడానికి అక్కడ జనం గుమిగూడారు. క్షతగాత్రుల కోసం ఆంబులెన్స్లు వచ్చిన తర్వాత మరో బాంబు విసరడంతో మరింత మంది మృతి చెందారని ఆ సంస్థ తెలిపింది.2012 నుంచి అలెప్పో నగరం రెండుగా విడిపోయింది. తూర్పు అలెప్పో ప్రాంతాన్ని తిరుగుబాటుదారులు ఆక్రమించుకోగా, పశ్చిమ అలెప్పో ప్రాంతం ప్రభుత్వం అధీనంలో ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







