15 మంది పౌరులు మృతి
- August 27, 2016
సిరియాలోని తూర్పు అలెప్పోలోని మాడీ నగరం వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడులలో 15 మంది పౌరులు మృతి చెందారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ మానిటర్ తెలిపింది. బాబ్ అల్ నేరబ్ జిల్లాలో గురువారం జరిగిన బాంబు దాడులలో 11 మంది పిల్లలతోపాటు 15 మంది మరణించారు. వారికి నివాళులర్పిస్తున్న ప్రజలకు సమీపంలో ప్రభుత్వ విమానం బ్యారెల్ బాంబును విసిరింది. గాయపడ్డ వారికి సహాయం చేయడానికి అక్కడ జనం గుమిగూడారు. క్షతగాత్రుల కోసం ఆంబులెన్స్లు వచ్చిన తర్వాత మరో బాంబు విసరడంతో మరింత మంది మృతి చెందారని ఆ సంస్థ తెలిపింది.2012 నుంచి అలెప్పో నగరం రెండుగా విడిపోయింది. తూర్పు అలెప్పో ప్రాంతాన్ని తిరుగుబాటుదారులు ఆక్రమించుకోగా, పశ్చిమ అలెప్పో ప్రాంతం ప్రభుత్వం అధీనంలో ఉంది.
తాజా వార్తలు
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!









