15 మంది పౌరులు మృతి

- August 27, 2016 , by Maagulf
15 మంది పౌరులు మృతి

సిరియాలోని తూర్పు అలెప్పోలోని మాడీ నగరం వరుస బాంబు దాడులతో దద్దరిల్లింది. ఈ దాడులలో 15 మంది పౌరులు మృతి చెందారని సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యూమన్‌ రైట్స్‌ మానిటర్‌ తెలిపింది. బాబ్‌ అల్‌ నేరబ్‌ జిల్లాలో గురువారం జరిగిన బాంబు దాడులలో 11 మంది పిల్లలతోపాటు 15 మంది మరణించారు. వారికి నివాళులర్పిస్తున్న ప్రజలకు సమీపంలో ప్రభుత్వ విమానం బ్యారెల్‌ బాంబును విసిరింది. గాయపడ్డ వారికి సహాయం చేయడానికి అక్కడ జనం గుమిగూడారు. క్షతగాత్రుల కోసం ఆంబులెన్స్‌లు వచ్చిన తర్వాత మరో బాంబు విసరడంతో మరింత మంది మృతి చెందారని ఆ సంస్థ తెలిపింది.2012 నుంచి అలెప్పో నగరం రెండుగా విడిపోయింది. తూర్పు అలెప్పో ప్రాంతాన్ని తిరుగుబాటుదారులు ఆక్రమించుకోగా, పశ్చిమ అలెప్పో ప్రాంతం ప్రభుత్వం అధీనంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com