'ముస్లిం మహిళలకు మేం వడ్డించం' : ప్యారిస్ రెస్టారెంటు
- August 29, 2016
ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ శివార్లలో ఉన్న ఓ రెస్టారెంటు ఇద్దరు ముస్లిం మహిళలకు వడ్డించకపోవడంతో ఒక్కసారిగా అక్కడ ఆగ్రహావేశాలు వెల్లువెత్తి నిరసనలకు దారితీసింది. ''ఉగ్రవాదులు ముస్లింలు, ముస్లింలంతా ఉగ్రవాదులు'' అని బురఖాలలో వచ్చిన ఇద్దరు మహిళలకు చెబుతున్నట్లుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్రెంబ్లే ప్రాంతంలోని లీ సెనాకిల్ రెస్టారెంటులో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో తమ రెస్టారెంటు ముందు గుమిగూడిన వారికి రెస్టారెంటు క్షమాపణలు తెలిపింది.ప్రస్తుతం వివిధ దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగానే తాను కూడా ఆందోళన చెందానని, ఫ్రెంచి బీచ్లలో బుర్కినీలు వేసుకున్న మహిళల గురించి జరుగుతున్న వివాదాలు కూడా అందుకు కారణమని రెస్టారెంటు యజమాని చెప్పారు.గత నవంబర్లో బాటాక్లాన్ సాంస్కృతిక కేంద్రంలో జరిగిన ఉగ్రదాడిలో తన స్నేహితుడు ఒకరు మరణించారని, దాని ప్రభావం కూడా తనపై ఉందని తెలిపారు. జాతి వివక్ష ఉన్న వ్యక్తులు పెడితే తాము తినబోమని ఆ మహిళల్లో ఒకరు చెప్పగా, జాతివివక్ష ఉన్నవాళ్లు ప్రజలను చంపరని రెస్టారెంటు యజమాని వారికి సమాధానం ఇచ్చారు. అయితే, ఇలాంటి వివాదాలను తాము సహించబోమని, దీనిపై విచారణకు ఆదేశించామని ఫ్రెంచి మంత్రి లారెన్స్ రోసిగ్నాల్ చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







