ప్రేమమ్‌లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్‌ విడుదల..

- August 29, 2016 , by Maagulf
ప్రేమమ్‌లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్‌ విడుదల..

నాగచైతన్య, శృతిహాసన్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ప్రేమమ్. ఇవాళ నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రేమమ్‌లోని ఎవరే అంటూ సాగే పాట ట్రైలర్‌ను విడుదల చేశారు. శ్రీమణి రాసిన ఈ పాటను విజయ్ ఏసుదాసు ఆలపించారు. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. చందుమొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీసుందర్ సంగీతాన్నందిస్తున్నారు. అనుపమా పరమేశ్వరన్, మడొన్నా సెబాస్టియన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మళయాళ మూవీకి రీమేక్‌గా ప్రేమమ్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com