జపాన్ ఉత్తర తీర ప్రాంతం లో టైఫూన్ బీభత్సం
- August 31, 2016
జపాన్ ఉత్తర తీర ప్రాంతాన్ని లయన్రాక్ టైఫూన్ తాకడంతో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇవాతే ప్రిఫెక్చర్లోని ఇవైజుమి నగరంలో భారీ వర్షాలకు ఆసుపత్రి నీటమునిగింది. ఈ భవనం నుంచి బుధవారం ఉదయం తొమ్మిది మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు. వర్షాలధాటికి నర్సింగ్ హోంలో కొంతభాగం మట్టిలో కూరుకుపోయింది. ఆ ప్రాంతంలో నీరు పెద్ద మొత్తంలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాహనాలు తలకిందులయ్యాయి.
ఈ టైఫూన్ కారణంగా జపాన్ ఉత్తర ప్రాంతంలోని రెండు నదులు ప్రమాదకరస్థాయికి మించి ప్రవహించడంతో పెద్ద ఎత్తున వచ్చిన వరద నీరుతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి.
సహాయ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లైన్స్ ధ్వంసమవ్వడంతో దాదాపు 10వేల గృహాలకు కరెంట్ నిలిచిపోయింది. దాదాపు 1,70,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. మంగళవారం సాయంత్రం నుంచి మినామి-ఫురానో, హొక్కైదో, హోన్షు తదితర ప్రాంతాలు టైఫూన్కు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
తాజా వార్తలు
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!







