ఒలింపిక్ స్టార్లను ఘనంగా సత్కరించిన దిల్లీ ప్రభుత్వం
- August 31, 2016
రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దిన కోచ్లు, ఫిజియోథెరపిస్టులను దిల్లీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. దిల్లీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రజత పతక విజేత పీవీ సింధు, రెజ్లింగ్లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్, వారి కోచ్లు గోపీచంద్, మన్దీప్లను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు. ఒలింపిక్ విజేతలకు అనుక్షణం తోడుగా ఉండి పూర్తిస్థాయి ఫిట్నెస్ను కాపాడుకోవడంతో తోడ్పడిన ఫిజియోథెరపిస్టులను సైతం ఈ కార్యక్రమంలో సత్కరించారు. గతంలో ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతులను ఈ సందర్భంగా సింధు, సాక్షి మలిక్లకు కేజ్రీవాల్ అందజేశారు.
అనంతరం సింధు, మలిక్ మాట్లాడుతూ.. దిల్లీ ప్రభుత్వం ప్రోత్సాహం, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







