ఒలింపిక్ స్టార్లను ఘనంగా సత్కరించిన దిల్లీ ప్రభుత్వం
- August 31, 2016
రియో ఒలింపిక్స్లో పతకాలు సాధించిన క్రీడాకారులు, వారిని తీర్చిదిద్దిన కోచ్లు, ఫిజియోథెరపిస్టులను దిల్లీ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. దిల్లీ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రజత పతక విజేత పీవీ సింధు, రెజ్లింగ్లో కాంస్య పతక విజేత సాక్షి మలిక్, వారి కోచ్లు గోపీచంద్, మన్దీప్లను దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘనంగా సత్కరించారు. ఒలింపిక్ విజేతలకు అనుక్షణం తోడుగా ఉండి పూర్తిస్థాయి ఫిట్నెస్ను కాపాడుకోవడంతో తోడ్పడిన ఫిజియోథెరపిస్టులను సైతం ఈ కార్యక్రమంలో సత్కరించారు. గతంలో ప్రకటించిన నగదు ప్రోత్సాహక బహుమతులను ఈ సందర్భంగా సింధు, సాక్షి మలిక్లకు కేజ్రీవాల్ అందజేశారు.
అనంతరం సింధు, మలిక్ మాట్లాడుతూ.. దిల్లీ ప్రభుత్వం ప్రోత్సాహం, అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ ప్రోత్సాహంతో రాబోయే రోజుల్లో దేశానికి మరిన్ని పతకాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు.
తాజా వార్తలు
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు
- మే 24 వరకు భారత విమానయాన సంస్థల పై పాక్ నిషేధం
- విదేశీ కార్మికుల స్థానంలో బహ్రెయిన్ లను నియమించండి..!!
- 2027 నుండి కొత్త డాక్టర్లకు లైసెన్సింగ్ పరీక్షలు..!!
- సౌదీలో 14 రిక్రూటింగ్ ఆఫీసులు సీజ్..!!
- కువైట్ నటి హయత్ అల్-ఫహద్ కన్నుమూత..!!
- రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చట్ట సవరణపై సమీక్ష..!!
- యూఏఈలో భారత పాస్పోర్ట్, వీసా సేవలు..అల్హింద్ కు కాంట్రాక్ట్..!!
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..









