భాగ్యనగరం లో స్పోర్ట్స్‌ టవర్‌ ప్రారంభం

- August 31, 2016 , by Maagulf
భాగ్యనగరం లో స్పోర్ట్స్‌ టవర్‌ ప్రారంభం

నగరంలోని గచ్చిబౌలి స్టేడియం వేదికగా స్పోర్ట్స్‌ టవర్‌ను రాష్ట్ర క్రీడల మంత్రి పద్మారావు గౌడ్‌ బుధవారం ప్రారంభించారు. సీఐఎ్‌సఎఫ్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరు 3 నుంచి 7 వరకు ఆలిండియా పోలీస్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ జరుగనున్న నేపథ్యంలో ఈ టవర్‌ ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం, శాట్స్‌ ఎండీ దినకర్‌బాబు, సౌతజోన్‌ డీఐజీ వేణుగోపాల్‌, నీసా డీఐజీ విక్రమ్‌, డీఏఈ డీఐజీ ఎంఆర్‌ నాయక్‌, కమాండెంట్‌ శ్రీనివా్‌సబాబు తదితరులు పాల్గొన్నారు. ఆలిండియా పోలీస్‌ అథ్లెటిక్స్‌లో 1000 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారని కమాండెంట్‌ శ్రీనివా్‌సబాబు తెలిపారు.

ఈ సందర్భంగా క్రీడాకారులకు కల్పించిన వసతి సౌకర్యాలను మంత్రి పద్మారావు పరిశీలించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com