ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా మద్దతు
- September 04, 2016
న్యూక్లియర్ సప్లైయర్స్ గ్రూప్లో భారత్ సభ్యత్వానికి ఆస్ట్రేలియా నుంచి మద్దతు లభించింది. చైనాలో జీ20 సదస్సుకు ముందు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్బుల్ భారత ప్రధాని నరేంద్రమోదీని కలిసిన సందర్భంగా ఈ విషయాన్ని తెలిపారు. ఆస్ట్రేలియా గతంలోనే భారత్ సభ్యత్వానికి మద్దతు తెలిపింది. దీనిని మాల్కం మరోసారి పునరుద్ఘాటించారు. ఈ విషయాన్ని భారత విదేశాంగశాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ తెలిపారు.
ఇరువురు నేతలు సమావేశంలో పలు అంశాలను చర్చించారు. ఇరు ప్రాంతాల్లో భద్రతాపరమైన సమస్యలు పరిష్కారానికి ప్రయత్నించారు. దీంతోపాటు ఇరు పక్షాలు పరస్పరం రక్షణ, భద్రతా పరమైన అంశాలపై సహకరించుకోవాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొవటానికి ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఏకం కావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









