సిరియా లో జంటబాంబు పేలుళ్లు: 43 మంది మృతి

- September 05, 2016 , by Maagulf
సిరియా లో జంటబాంబు పేలుళ్లు: 43 మంది మృతి

సిరియాలో ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేశారు. టార్టస్ నగరం శివారులో చెక్ పాయింట్ వద్ద సోమవారం జంటబాంబు పేలుళ్లు సంభవించడంతో కనీసం 43 మంది మరణించారు.

పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనాన్ని భద్రత దళాలు తనిఖీ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో గాయపడిన సైనికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మిలటరీ యూనిఫామ్ లో వచ్చిన బాంబర్లు భద్రత దళాలు లక్ష్యంగా దాడి చేశారు. ఇదే రోజు హామ్స్ ప్రావిన్స్ లో ఓ చెక్ పాయింట్ వద్ద మరో కారు బాంబు పేలుడు సంభవించింది. కాగా ఎవరికీ హాని జరిగినట్టు వార్తలు రాలేదు. సిరియా రాజధాని డమాస్కస్ లో కూడా ఉగ్రవాదులు దాడి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com