సెప్టెంబరు 18న విడుదల కానున్న 'జాగ్వార్‌' ఆడియో

- September 05, 2016 , by Maagulf
సెప్టెంబరు 18న  విడుదల కానున్న 'జాగ్వార్‌' ఆడియో

మాజీ ప్రధాని దేవెగౌడ్‌ మనవడు నిఖిల్‌ కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ రూ. 75 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న 'జాగ్వార్‌' చిత్రం ఆడియోను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. చిత్ర బృందం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్లను విడుదల చేసింది. ఎ. మహదేవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనితా కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తుండగా హెచ్‌.డి. కుమారస్వామి సమర్పిస్తున్నారు. థమన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్‌, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

 

ఈ సందర్భంగా హెచ్‌.డి. కుమారస్వామి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిత్ర పరిశ్రమలోని టాప్‌ టెక్నీషియన్స్‌, ఆర్టిస్టులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.

తమన్నా ప్రత్యేక గీతం సినిమాకి హైలైట్‌ కానుంది. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబరు 18న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం. దసరా కానుకగా అక్టోబరు 6న సినిమాను విడుదల చేయబోతున్నాం' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com