సెప్టెంబరు 18న విడుదల కానున్న 'జాగ్వార్' ఆడియో
- September 05, 2016
మాజీ ప్రధాని దేవెగౌడ్ మనవడు నిఖిల్ కుమార్ను హీరోగా పరిచయం చేస్తూ రూ. 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న 'జాగ్వార్' చిత్రం ఆడియోను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. చిత్ర బృందం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్లను విడుదల చేసింది. ఎ. మహదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనితా కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తుండగా హెచ్.డి. కుమారస్వామి సమర్పిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. చిత్ర పరిశ్రమలోని టాప్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
తమన్నా ప్రత్యేక గీతం సినిమాకి హైలైట్ కానుంది. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబరు 18న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం. దసరా కానుకగా అక్టోబరు 6న సినిమాను విడుదల చేయబోతున్నాం' అన్నారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







