సిరియా లో జంటబాంబు పేలుళ్లు: 43 మంది మృతి
- September 05, 2016
సిరియాలో ఉగ్రవాదులు దేశవ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేశారు. టార్టస్ నగరం శివారులో చెక్ పాయింట్ వద్ద సోమవారం జంటబాంబు పేలుళ్లు సంభవించడంతో కనీసం 43 మంది మరణించారు.
పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్న వాహనాన్ని భద్రత దళాలు తనిఖీ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ దాడిలో గాయపడిన సైనికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో మరో ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. మిలటరీ యూనిఫామ్ లో వచ్చిన బాంబర్లు భద్రత దళాలు లక్ష్యంగా దాడి చేశారు. ఇదే రోజు హామ్స్ ప్రావిన్స్ లో ఓ చెక్ పాయింట్ వద్ద మరో కారు బాంబు పేలుడు సంభవించింది. కాగా ఎవరికీ హాని జరిగినట్టు వార్తలు రాలేదు. సిరియా రాజధాని డమాస్కస్ లో కూడా ఉగ్రవాదులు దాడి చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







