బాగ్దాద్ లో కారు బాంబుతో దాడి : 7 మంది మృతి
- September 05, 2016
ఉగ్రవాదులు కారు బాంబుతో దాడికి పాల్పడటంతో దాదాపు 7 మంది మృతిచెందగా, మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సోమవారం రాత్రి ఇరాక్ రాజధాని బాగ్దాద్ లో చోటుచేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గత జూలైలో బాంబు దాడి జరిగి 300కు పైగా ప్రాణాలను బలిగొన్న ఏరియాకు సమీపంలోనే ఈ దుర్ఘటన జరగడం గమనార్హం.సోమవారం అర్ధరాత్రి కారు బాంబు పేల్చివేయడంతో దాదాపు ఏడుమంది వ్యక్తులు దుర్మరణం పాలవ్వగా, 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అబ్దెల్ మజీత్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమీపంలోని కొన్ని షాపులు దగ్ధమయ్యాయి.ఇప్పటివరకూ ఏ ఉగ్రవాద సంస్థ ఈ చర్యకు బాధ్యత వహించలేదని ఇరాక్ అధికారులు వివరించారు. ఐఎస్ఎస్ ఉగ్రసంస్థ గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







