మార్స్ పోస్టర్ కాంపిటీషన్ ప్రారంభం
- September 06, 2016
దుబాయ్: అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు 20,000 దిర్హామ్లకు పైగానే విలువగల బహుమతులు గెలిచే ఛాన్స్ రానే వచ్చింది. మార్స్పై రీసెర్చ్ నేపథ్యంలో ఔత్సాహికులు ఎవరైనా తమ ఆలోచనల్ని పోస్టర్ రూపంలో ప్రదర్శించగలగాలి. అలా వచ్చిన బెస్ట్ పోస్టర్స్కి 20,000 దిర్హామ్ల బహుమతి దక్కనుంది. మొహమ్మద్ బిన్ రషీద్ స్పేస్ సెంటర్ (ఎంబిఆర్ఎస్సి) ఈ కాంపిటీషన్ని ప్రకటించింది. 'ఎక్స్ప్లోర్ మార్స్ పోస్టర్ కాంపిటీషన్' పేరుతో దీన్ని నిర్వహిస్తారు. జియాలజీ, అట్మాస్ఫియర్, హాబిటబిలిటీ ఆఫ్ మార్స్ వంటి అంశాలపై డెప్త్ రీసెర్చ్ వంటి విభాగాల్లో కాంపిటీషన్ని నిర్వహించనున్నారు. ఆన్లైన్ ద్వారా ఔత్సాహికులు తమ వివరాల్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 8 లోపు ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయాలిష్ట్ర్స ఉంటుంది. పోస్టర్స్ సబ్మిట్ చేయడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 28. ప్రముఖ జాతీయ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు జడ్జిలుగా వ్యవహరిస్తారు. అక్టోబర్ 3న జరిగే ఇఎంఎం సైన్స్ వర్క్షాప్లో విజేతల్ని ప్రకటిస్తారు. తొలి బహుమతి విజేత 10,000 దిర్హామ్లు, రెండో విజేత 7,000 దిర్హామ్లు, మూడో బహుమతి విజేత 5,000 దిర్హామహల బహుమతి గెలచుకునే అవకాశం ఉంది. వివరాలకు ఎంబిఆర్ఎస్సి వెబ్సైట్ని సంప్రదించగలరు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







