ఒమన్ ట్రాఫిక్ జరీమానాల్లో 2000 శాతం పెరుగుదల
- September 06, 2016
మస్కట్: ఒమన్ ట్రాఫిక్ చట్టానికి చేసిన సవరణలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు ఇంకా కఠినమైన చర్యలుంటాయి. 10 రోజుల నుంచి 2 సంవత్సరాల వరకు కొన్ని నిబంధనల ఉల్లంఘనలకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. జరీమానాలు కూడా 200 రియల్స్ నుంచి 3000 రియాల్స్ వరకు ఉంటాయి. రహదారిపై భద్రత కోసం కఠిన చర్యలు తప్పడంలేదని, ప్రమాదాల్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది జూన్ నెలాఖరు వరకు మొత్తం 336 మంది, 2100 రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందినట్లు నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫిగర్స్ వెల్లడిస్తున్నాయి. 2015 జులై డెడ్లీయెస్ట్ మంత్గా రికార్డులకెక్కింది. మొత్తం 71 మంది ఈ నెలలో రోడ్డు ప్రమాదాల్లో చనిపోయారు. కొత్త నిబంధనల ప్రకారం మద్యం సేవించి వాహనాన్ని నడిపితే 10 నుంచి 30 రోజులపాటు జైలు శిక్ష తప్పదు. అలాగే 50 రియాల్స్ నుంచి 300 రియాల్స్ వరకు ఫైన్ విధిస్తారు. రోడ్డుపై ప్రమాదకర స్థితిలో ఫీట్స్ చేస్తే 3 నెలల జైలు శిక్ష, 500 రియాల్స్ ఫైన్ విధిస్తారు. రెక్లెస్గా వాహనాన్ని నడిపినా 3,000 రియాల్స్ వరకూ జరీమానా చెల్లించాల్సి రావొచ్చు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







