ఎయిర్‌ ఏషియా డిస్కౌంట్‌ సేల్‌ ..

- September 06, 2016 , by Maagulf
ఎయిర్‌ ఏషియా డిస్కౌంట్‌ సేల్‌ ..

బడ్జెట్‌ విమానయాన సంస్థ ఎయిర్‌ ఏషియా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మరో ఆఫర్‌తో ముందుకొచ్చింది. ముందస్తు బుకింగ్‌లపై అన్ని ఛార్జీలు కలిపి రూ. 599 ప్రారంభ ధరతో విమాన టికెట్లపై డిస్కౌంట్‌ ఆఫర్‌ ప్రకటించింది. సెప్టెంబర్‌ 11 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. 2017, ఫిబ్రవరి 6 నుంచి 2017 అక్టోబర్‌ 28 మధ్య ఎయిర్‌ఏషియా దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.దీని ప్రకారం.. గువాహటి-ఇంఫాల్‌కు అన్ని ఛార్జీలు కలిపి విమాన టికెట్‌ ధర రూ.599గా ఉంది. అంతేగాక, బెంగళూరు నుంచి కోచికి రూ. 899, గోవాకు రూ. 1,099, విశాఖపట్నానికి రూ.1,199, దిల్లీకి రూ. 2,299, పుణెకు రూ. 1,299గా టికెట్‌ ధరలు ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి కూడా ముందస్తు టికెట్లపై డిస్కౌంట్‌ ప్రకటించింది ఎయిర్‌ఏషియా.ఆఫర్‌ కింద కోచి నుంచి కౌలాలంపూర్‌కు టికెట్‌ ధర రూ. 3,399గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్‌ కింద ఎన్ని సీట్లను కేటాయించబోతోందన్న విషయాన్ని మాత్రం ఎయిర్‌ఏషియా వెల్లడించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com