ఎయిర్ ఏషియా డిస్కౌంట్ సేల్ ..
- September 06, 2016
బడ్జెట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు మరో ఆఫర్తో ముందుకొచ్చింది. ముందస్తు బుకింగ్లపై అన్ని ఛార్జీలు కలిపి రూ. 599 ప్రారంభ ధరతో విమాన టికెట్లపై డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించింది. సెప్టెంబర్ 11 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. 2017, ఫిబ్రవరి 6 నుంచి 2017 అక్టోబర్ 28 మధ్య ఎయిర్ఏషియా దేశీయ మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.దీని ప్రకారం.. గువాహటి-ఇంఫాల్కు అన్ని ఛార్జీలు కలిపి విమాన టికెట్ ధర రూ.599గా ఉంది. అంతేగాక, బెంగళూరు నుంచి కోచికి రూ. 899, గోవాకు రూ. 1,099, విశాఖపట్నానికి రూ.1,199, దిల్లీకి రూ. 2,299, పుణెకు రూ. 1,299గా టికెట్ ధరలు ఉండనున్నాయి. అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణించే వారికి కూడా ముందస్తు టికెట్లపై డిస్కౌంట్ ప్రకటించింది ఎయిర్ఏషియా.ఆఫర్ కింద కోచి నుంచి కౌలాలంపూర్కు టికెట్ ధర రూ. 3,399గా ఉండనుంది. అయితే ఈ ఆఫర్ కింద ఎన్ని సీట్లను కేటాయించబోతోందన్న విషయాన్ని మాత్రం ఎయిర్ఏషియా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







