'ఎమిరేట్స్' విమాన ప్రమాదంపై ప్రాథమిక నివేదిక
- September 06, 2016
గత నెలలో దుబాయ్ విమానాశ్రయంలో జరిగిన ఎమిరేట్స్ విమాన ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు నివేదికను మంగళవారం అధికారులు వెల్లడించారు. ల్యాండ్ అవుతున్న విమానాన్ని తిరిగి పైకి తీసుకెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు విశ్లేషించారు. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ చరిత్రలోనే ఘోర ప్రమాదంగా ఇది రికార్డుకెక్కింది. అయితే అదృష్టవశాత్తూ 300 మంది ప్రయాణికులు సిబ్బంది ప్రాణాలతో బయటపడ్డారు. మంటలను అదుపుచేసే క్రమంలో అగ్నిమాపక సిబ్బంది ఒకరు మృతి చెందారు.
ఈ విమాన ప్రమాదంపై అరబ్ ఎమిరేట్స్ పౌర విమాన అధికార యంత్రాంగం దర్యాప్తు జరిపింది. ఫ్లైట్ డేటా, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంభాషణ, ఆయా రంగాల విశ్లేకుల ఇంటర్వూలతో కూడిన 28 పేజీల నివేదికను రూపొందించారు.
కేరళలోని తిరువనంతపురం నుంచి దుబాయ్ విమానాశ్రాయానికి చేరిన ఈ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు పైలట్ ప్రయత్నించాడు. అయితే రన్ వేపై దిగినంతలోనే మళ్లీ పైకి ఎగిరించే క్రమంలో ముందు చక్రం తెరుచుకోలేదు. అప్పటికే 125 నాట్స్ వేగంతో విమానం ముందు భాగం రన్వేను తాకి కొంతదూరం దూసుకెళ్ళింది. ఆ రాపిడికి విమానం ఇంజన్కు మంటలు అంటుకోవడంతో కొద్ది క్షణాల్లో అది పూర్తిగా కాలిపోయింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









