'మజ్ను' గీతాలు విడుదల..
- September 06, 2016
నా ని కథానాయకుడిగా నటించిన చిత్రం 'మజ్ను'. అను ఇమ్మాన్యుయల్, ప్రియా శ్రీ కథానాయికలు. విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పి.కిరణ్, గోళ్ల గీత నిర్మాతలు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. తొలి సీడీని నాని విడుదల చేశారు. రాజ్ తరుణ్ అందుకొన్నారు. ప్రచార చిత్రాల్ని దిల్రాజు, సుధాకర్రెడ్డి, అనిల్ సుంకర సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ''అందర్నీ నవ్వించే సినిమా ఇది. సినిమా చూసి ఇంటికెళ్లినా మజ్నునే గుర్తొస్తాడు. విరించి వర్మ రాసుకొనే ప్రతి కథలో, ప్రతీ పాత్రలో నిజాయతీ కనిపిస్తుంది.
'ఉయ్యాల జంపాల' కథ నాకే ముందు వినిపించాడు. కానీ అప్పుడు కుదర్లేదు. 'ఉయ్యాల జంపాల' కంటే 'మజ్ను' మంచి సినిమా అవుతుంది. గోపీ సుందర్ పాటలు బాగున్నాయి.
నా సినిమాల్లో ఇదే బెస్ట్ ఆల్బమ్'' అన్నారు. దర్శకుడు చెబుతూ ''ఇష్టమా, ప్రేమా? అనే గందరగోళం ప్రతీ బంధంలోనూ కనిపిస్తుంటుంది. ఈప్రేమ ఎన్ని రోజులో..
అనే గందరగోళం సహజమే. అలాంటి ఆలోచనలున్న కుర్రాడి కథ ఇది. వినోదం, ప్రేమ, సంగీతం.. ఇవన్నీ చక్కగా కుదిరాయ''న్నారు దర్శకుడు.
''ప్రేమకీ, సంగీతానికీ భాష అవసరం లేదు. ఈ పాటలు విని 'నా కెరీర్లోనే ఇది బెస్ట్ ఆల్బమ్' అని నాని చెప్పడం ఆనందాన్నిచ్చింది. రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యం అందించార''న్నారు గోపీ సుందర్. ''కిరణ్ మంచి కథల్ని ఎంచుకొంటారు.
నాని వరుసగా నాలుగు విజయాలు అందుకొన్నాడు. ఇది ఐదవ విజయం అవుతుందన్న నమ్మకం ఉంద''న్నారు దిల్రాజు. ఈ కార్యక్రమంలో నారాయణదాస్, కల్యాణ్ కృష్ణ, మారుతి, ఇంద్రగంటి మోహనకృష్ణ, సునీల్, అనిల్ సుంకర, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









