'మజ్ను' గీతాలు విడుదల..
- September 06, 2016
నా ని కథానాయకుడిగా నటించిన చిత్రం 'మజ్ను'. అను ఇమ్మాన్యుయల్, ప్రియా శ్రీ కథానాయికలు. విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. పి.కిరణ్, గోళ్ల గీత నిర్మాతలు. గోపీ సుందర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని గీతాలు హైదరాబాద్లో విడుదలయ్యాయి. తొలి సీడీని నాని విడుదల చేశారు. రాజ్ తరుణ్ అందుకొన్నారు. ప్రచార చిత్రాల్ని దిల్రాజు, సుధాకర్రెడ్డి, అనిల్ సుంకర సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ''అందర్నీ నవ్వించే సినిమా ఇది. సినిమా చూసి ఇంటికెళ్లినా మజ్నునే గుర్తొస్తాడు. విరించి వర్మ రాసుకొనే ప్రతి కథలో, ప్రతీ పాత్రలో నిజాయతీ కనిపిస్తుంది.
'ఉయ్యాల జంపాల' కథ నాకే ముందు వినిపించాడు. కానీ అప్పుడు కుదర్లేదు. 'ఉయ్యాల జంపాల' కంటే 'మజ్ను' మంచి సినిమా అవుతుంది. గోపీ సుందర్ పాటలు బాగున్నాయి.
నా సినిమాల్లో ఇదే బెస్ట్ ఆల్బమ్'' అన్నారు. దర్శకుడు చెబుతూ ''ఇష్టమా, ప్రేమా? అనే గందరగోళం ప్రతీ బంధంలోనూ కనిపిస్తుంటుంది. ఈప్రేమ ఎన్ని రోజులో..
అనే గందరగోళం సహజమే. అలాంటి ఆలోచనలున్న కుర్రాడి కథ ఇది. వినోదం, ప్రేమ, సంగీతం.. ఇవన్నీ చక్కగా కుదిరాయ''న్నారు దర్శకుడు.
''ప్రేమకీ, సంగీతానికీ భాష అవసరం లేదు. ఈ పాటలు విని 'నా కెరీర్లోనే ఇది బెస్ట్ ఆల్బమ్' అని నాని చెప్పడం ఆనందాన్నిచ్చింది. రామజోగయ్య శాస్త్రి చక్కటి సాహిత్యం అందించార''న్నారు గోపీ సుందర్. ''కిరణ్ మంచి కథల్ని ఎంచుకొంటారు.
నాని వరుసగా నాలుగు విజయాలు అందుకొన్నాడు. ఇది ఐదవ విజయం అవుతుందన్న నమ్మకం ఉంద''న్నారు దిల్రాజు. ఈ కార్యక్రమంలో నారాయణదాస్, కల్యాణ్ కృష్ణ, మారుతి, ఇంద్రగంటి మోహనకృష్ణ, సునీల్, అనిల్ సుంకర, హను రాఘవపూడి తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!
- అబుదాబిలో 4 దర్బ్ టోల్ గేట్ల పేర్లలో మార్పులు..!!
- ఇంధన భద్రతపై సౌదీ-భారత్ చర్చలు..!!
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం









