పది 'ఆసియాన్' దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశం కానున్న మోదీ
- September 06, 2016
భారత ప్రధాని మోదీ బుధవారం లావోస్ రాజధాని వియంటియాన్లో పది 'ఆసియాన్' దేశాల అధినేతలతో విడివిడిగా సమావేశం కానున్నారు. ఆసియాన్-భారత్ 14వ శిఖరాగ్ర సమావేశంలో ప్రధానంగా సముద్రతల భద్రత, ఉగ్రవాదం, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక సహకారంపై చర్చించనున్నారు. మంగళవారం మొదలైన ఆసియాన్ దేశాల సదస్సులో భాగంగా బుధవారం ఆసియాన్ భారత్ శిఖరాగ్ర సమావేశం, గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం జరుగుతాయి. ఈ రెండింటిలోనూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆసియాన్-భారత్ స్వేచ్ఛా వాణిజ్య ప్రాంతాన్ని 2015లో ప్రకటించినప్పటి నుంచి ఆ దేశాలతో భారత్ వాణిజ్య బంధం మరింత బలపడింది.మన వాణిజ్యంలో 12 శాతం ఈ పది దేశాలతోనే ఉంది. గురువారం తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పది ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, అమెరికా, రష్యా పాల్గొంటాయి. 2005లో తూర్పు ఆసియా శిఖరాగ్ర వేదిక ఏర్పాటు చేసినప్పటి నుంచీ భారత్ అందులో సభ్యురాలిగా ఉంది. దక్షిణ చైనా సముద్రం మీద చైనా దుందుడుకు చర్యలపై ఆసియాన్ దేశాలు అభ్యంతరం చెబుతున్న తరుణంలో తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో ఆయా పక్షాలు అనుసరించే వైఖరి ఆసక్తికరంగా మారింది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







