కేంద్ర మంత్రి వికె సింగ్కి కువైట్ ఘన స్వాగతం
- September 07, 2016
కువైట్: కువైట్లోని ఇండియన్ ఎంబసీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జనరల్ వికె సింగ్కి ఇండియా హౌస్ వద్ద ఘన స్వాగతం పలికింది. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం కువైట్కి విచ్చేశారు వికె సింగ్. కువైట్లోని భారత రాయబారి సునీల్ జైన్, కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు పారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ సబా ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా మరియు కువైటీ అధికారులతో అంతకు ముందు భారత కమ్యూనిటీ కువైట్లో ఎదుర్కొంటున్న సమస్యలపై వికె సింగ్ చర్చించారు. ఈ రోజు వికె సింగ్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు లేబర్ హింద్ అల్ సుబైయా మరియు ఇంటీరియర్ మినిస్టర్తో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇంకో వైపున కమ్యూనిటీ ఇంటరాక్షన్ని సాయంత్రం ఆరున్నర గంటలకు ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసింది. కువైట్లోని పలు రిజిస్టర్డ్ అసోసియేషన్స్, ఇండియన్ స్కూల్స్ ప్రతినిథులు, ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీల ప్రతినిథులు, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్, మీడియా ప్రతినిథులకు ఈ మేరకు ఆహ్వానం అందింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







