హజ్పై రాజకీయాలొద్దు: ఇరాన్కి తెలిపిన ఓఐసి
- September 07, 2016
దుబాయ్: జెడ్డా కేంద్రంగా పనిచేస్తున్న ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ (ఓఐసి), సౌదీ ప్రభుత్వం హజ్ యాత్రీకుల కోసం చేపడ్తున్న కార్యక్రమాల్ని అభినందిస్తున్నట్లు తెలిపింది. ఓఐసి మీడియా డిపార్ట్మెంట్ హెడ్ మహా అకీల్ మాట్లాడుతూ ఈ విషయాల్ని వెల్లడించారు. హజ్ యాత్ర సంద్భంగా గత ఏడాది చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్రంగా స్పందించారు ఇరానియన్ సుప్రీం లీడర్ అయాతోల్లా అలిఖామెనె. ప్రపంచంలోని ముస్లిం సమాజం, ముస్లిం దేశాలు, హోలీ మాస్క్ల నిర్వహణ విషయంలో ప్రత్యామ్నాయాల గురించి ఆలోచించాల్సిందిగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్లు ఇరానీ మీడియా వెలుగులోకి తెచ్చింది. అయితే, అలాంటి అవసరం ఏమీ లేదని ఓఐసి స్పష్టం చేసింది. పవిత్ర హజ్ యాత్ర విషయంలో ఇలాంటి రాజకీయాలు ఏమాత్రం తగవని ఓఐసి పేర్కొంది. హజ్ యాత్ర సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమనీ, ఈ ఘటన నేపథ్యంలో సౌదీ ప్రభుత్వం స్పందించిన తీరు అభినందనీయమని ఓఐసి వర్గాలు తెలిపాయి. 400 యాత్రీకుల మరణంతో ఇరాన్, హజ్ యాత్రను మూడేళ్ళపాటు (80ల చివర్లో) నిషేధించింది. సౌదీ అరేబియా విషయంలో ఇరాన్ మొదటి నుంచీ గుర్రుగా ఉన్నా, గతంలో కన్నా ఎక్కువగా ఈసారి సౌదీపై విషం చిమ్ముతోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఖతార్లోని మిడిల్ ఈస్టర్న్ స్టడీస్ ప్రొఫెసర్ మజౌబ్ అల్ జెవెరి మాట్లాడుతూ, సౌదీని విమర్శించడంలో ఇరాన్ లీడర్లు అత్యుత్సాహం చూపుతున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







