బ్యాడ్‌ ఫుడ్‌ అమ్మకాలపై యుద్ధం

- September 07, 2016 , by Maagulf
బ్యాడ్‌ ఫుడ్‌ అమ్మకాలపై యుద్ధం

రియాద్‌: 140,000 ఆహార పదార్థాల ప్యాకేజీలను సీజ్‌ చేశారు అధికారులు. హజ్‌ సందర్భంగా మక్కాలో అమ్మకాల కోసం ఓ వేర్‌ హౌస్‌లో వీటిని స్టోర్‌ చేశారు. మినిస్ట్రీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చేపట్టిన ఇన్‌స్పెక్షన్‌ క్యాంపెయిన్‌లో ఈ ఆహార పదార్థాలు పట్టుబడ్డాయి. పట్టుబడ్డవాటిలో 3,000 బేబీ మిల్క్‌ పార్ములాస్‌ కూడా ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న ఆహార పదార్థాల్ని పరీక్షలకోసం పంపామనీ, వాటిల్లో కొన్నిటిని ఇప్పటికే ధ్వంసం చేశామనీ, ఈ సందర్భంగా పట్టుబడ్డవారిపై నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు చెప్పారు. ఇంకో వైపున జ్యుయెలరీ, ప్రెసియస్‌ మెటల్‌ షాప్స్‌, గ్యాస్‌ స్టేషన్లు, ఆటో వర్క్‌ షాప్‌లపై కూడా తనిఖీలు నిర్వహిస్తామన్నారు అధికారులు. మొబైల్‌ సాప్స్‌, కమర్షియల్‌ రిఫ్రిజిరేటర్లు, ఫుడ్‌ ట్రక్స్‌పైన కూడా అధికారులు ఫోకస్‌ పెట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com