రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు..
- September 07, 2016
కేసు నమోదు చేసిన 24 గంటల్లోగా సదరు ఎఫ్ఐఆర్లను ఆయా వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పోలీస్ శాఖలను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది.ఎఫ్ఐఆర్ను 24 గంటల్లోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలంటూ ఇటీవల దిల్లీ హైకోర్టు నగర పోలీసులను ఆదేశించింది. దీంతో హైకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. భారత యువ లాయర్ల అసోసియేషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం..దిల్లీ హైకోర్టు ఆదేశాలను అంగీకరిస్తూనే, కొన్ని మార్పులు చేసింది.అన్ని రాష్ట్రాల పోలీస్ అధికారులు 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. తొలుత 48 గంటల సమయం ఇవ్వాలని భావించినప్పటికీ.. 24 గంటల పరిమితినిస్తూ తీర్పు చెప్పింది. ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేని ప్రాంతాల్లో మాత్రం 72 గంటల్లోగా అప్లోడ్ చేసేందుకు అనుమతినిచ్చింది. కాగా.. మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపుల లాంటి కేసుల్లో ఎఫ్ఐఆర్ను అప్లోడ్ చేయడంలో మినహాయింపు కల్పించింది.
తాజా వార్తలు
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!







