అక్టోబర్ 1 నుంచి సాకర్ టోర్నీ మూడో సీజన్..

- September 08, 2016 , by Maagulf
అక్టోబర్ 1 నుంచి సాకర్ టోర్నీ మూడో సీజన్..

సాకర్ టోర్నీ మూడో సీజన్ హంగామా మొదలైంది. గడిచిన రెండు సీజన్లు ఆడియన్స్‌ని పెద్దగా ఎట్రాక్ట్ చేసుకోలేదు. ఈలోగా టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, చిరంజీవి, టీమిండియా మాజీ ఆటగాడు సచిన్ టెండూల్కర్‌లు సాకర్‌లోకి అడుగుపెట్టేశారు. స్టార్ సెలబ్రిటీస్ అడుగువేయడంతో టోర్నీకి కళ వచ్చేసింది. అక్టోబర్ 1 నుంచి టోర్నీ మొదలుకానుంది.
ఈ సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్‌ న్యూటీమ్‌ని ప్రకటించింది. ఓనర్స్ సచిన్‌, చిరంజీవి, నాగార్జున, అల్లు అరవింద్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌లు జట్టుని ఇంట్రడ్యూస్ చేసుకునే పనిలోపడ్డారు. ఈ క్రమంలో ఓనర్స్ ఒకే వేదికపై కేరళ ట్రెడిషన్ స్టయిల్‌లో కనిపించి పోరుకు తాము సై అంటూ ప్రత్యర్థులకు సంకేతాలిచ్చేశారు.మోలీవుడ్ యంగ్ హీరో నివిన్‌ పౌలిని జట్టుకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా కాగా, కోచ్‌గా స్టీఫెన్‌ కాంపెల్ నియమించింది. తొలిసారి సెలబ్రిటీలు ఇలా కనిపించడంతో సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com